చత్తిస్ ఘడ్ రాష్టం లోని సుక్మా , దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో సుక్మా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కూంబింగ్ లో వున్న పోలీసు లకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. సుక్మ, దంతేవాడ జిల్లా ల సరిహద్దులోని గొరేలి, ముఠేలి అటవీప్రాంతంలో కాల్పులు జరిగాయి. కాగా ఘటనా స్థలం నుంచి మహిళా మావోయిస్టుల మృతదేహలతో పాటు 12బోర్ ఆయుధాలతో పాటు ఒక నాటు తుపాకీ , నక్సల్ సామాగ్రి ని పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ ప్రాంతంలో మరిన్ని బలగలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదిలా వుండగా మరణించిన ఇద్దరు నేతలు ఓ అగ్రనేత కు సెక్యూరిటి సిబ్బంది అని తెలిసింది .
next post