పగలంతా కాయకష్టం చేసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మహిళా రైతు కూలీలు మరణించారు. ఈ దుర్ఘటన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లి పంటపొలాల్లో మంగళవారం రాత్రి జరిగింది.
ట్రాక్టర్ కు కట్టుకొని వస్తున్న చెనిక్కాయ మిషన్ కింద పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరణించిన వారిని రూతమ్మ, వెంకటసుబ్బమ్మ గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని పెండ్లిమర్రి ఎస్సై కొండారెడ్డి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.