తెలంగాణ పై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో నేడు రైతు నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపుతున్నదని అన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు అడుతున్నాడని కమలాకర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే అని ఆయన అన్నారు. వరి పంట కొనకపోతే బీజేపీ కి నూకలు చెల్లుతాయి. తెలంగాణ ప్రజలు నూకలు తినమని కేంద్ర మంత్రి అవమాన పరిచాడని కమలాకర్ అన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకూ ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.