28.7 C
Hyderabad
May 6, 2024 09: 49 AM
Slider కరీంనగర్

తెలంగాణ పై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ పై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో నేడు రైతు నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపుతున్నదని అన్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు అడుతున్నాడని కమలాకర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే అని ఆయన అన్నారు. వరి పంట కొనకపోతే బీజేపీ కి నూకలు చెల్లుతాయి. తెలంగాణ ప్రజలు నూకలు తినమని కేంద్ర మంత్రి అవమాన పరిచాడని కమలాకర్ అన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకూ ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

Related posts

మత మార్పుడులకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగీరా

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

Satyam NEWS

షాకింగ్: జనగామ ఎమ్మెల్యే భార్యకు కూడా కరోనా

Satyam NEWS

Leave a Comment