నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కైలాస వాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనం ఇచ్చారు. అదే విధంగా మహాదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ దేవి దర్శనమిచ్చారు. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు నిర్వహించగా ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ, శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీ హోమం జరిగాయి. కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లు, మహా దుర్గా అలంకారంలో అమ్మవారి ఉత్సవమూర్తులను అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలతో రంగ రంగ వైభవంగా గ్రామోత్సవం జరిగింది. రాత్రి శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం జరిగింది.
previous post