29.7 C
Hyderabad
April 29, 2024 07: 51 AM
Slider ఆదిలాబాద్

అవినీతి అక్రమాలపై పొరాడుతున్న జర్నలిస్టుకు సత్కారం

#journalist

అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్న జర్నలిస్టును ఆదివాసి పెద్దలు సన్మానించారు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరీడి గ్రామపంచాయతీ కొలం లింబుగూడా గ్రామంలో జరిగింది. సమేల భీమయ్య చట్టి వార్షికోత్సవ సందర్భంగా విలేఖరి కే రాజేశ్వర్ ని సన్మానించారు. సోమవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు, కొలం సంఘ ఉపాధ్యక్షుడు ఆత్రం జలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ రాజేశ్వర్ ను సన్మానించడం అభినందనీయమని అన్నారు. రాజేశ్వర్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సేవలను దృష్టిలో ఉంచుకుని చిరు సన్మాన సత్కారం చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు.

Related posts

లక్ష్మారెడ్డి గెలుపుకోసం ముస్లీమ్ వెల్ఫేర్న కమిటీ తీర్మానం

Satyam NEWS

రాజకీయ నాయకుల రాకతో సందడిగా వివాహ రిసెప్షన్

Satyam NEWS

దేశంలో మొట్టమొదటి సారిగా లైవ్ లో కోర్టు ప్రొసీడింగ్స్

Satyam NEWS

Leave a Comment