అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్న జర్నలిస్టును ఆదివాసి పెద్దలు సన్మానించారు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరీడి గ్రామపంచాయతీ కొలం లింబుగూడా గ్రామంలో జరిగింది. సమేల భీమయ్య చట్టి వార్షికోత్సవ సందర్భంగా విలేఖరి కే రాజేశ్వర్ ని సన్మానించారు. సోమవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు, కొలం సంఘ ఉపాధ్యక్షుడు ఆత్రం జలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ రాజేశ్వర్ ను సన్మానించడం అభినందనీయమని అన్నారు. రాజేశ్వర్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సేవలను దృష్టిలో ఉంచుకుని చిరు సన్మాన సత్కారం చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు.
previous post