29.7 C
Hyderabad
May 1, 2024 05: 12 AM
Slider రంగారెడ్డి

భూగర్భ డ్రైనేజీ కోసం ఐదు లక్షలు విడుదల చేసిన జడ్ పి టి సి

#talakondapally

భూగర్భ డ్రైనేజీ కోసం 5 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తలకొండపల్లి జెడ్ పి టి సిఉప్పల వెంకటేష్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామపంచాయతీలో అండర్ డ్రైనేజీ సదుపాయం కల్పించుటకు బుధవారం జిల్లా పరిషత్ నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో  ప్రధాన నగరాలలో ఏం జరుగుతుందో మనమంతా చూస్తున్నామని కొద్దిపాటి వర్షానికే ఆస్తి నష్టం జననష్టంతో ప్రజలు తీవ్ర నరకయాతన పడుతున్నారని అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదని అన్నారు. వరద నీరు మురికి నీరు ప్రవహించే మార్గాల్లో అండర్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి ప్రజల ఆరోగ్యంతో పాటు  గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, నగరాలకంటే గ్రామాల్లోనే ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలని  ఆయన ఆకాంక్షించారు. అనంతరంనిధులు విడుదల చేసిన ప్రోసిడింగ్ కాపీని స్థానిక సర్పంచ్ నరేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మండల కో ఆప్షన్ మెంబర్ ఇమ్రాన్ యువ నాయకులు విజేందర్ రెడ్డి నరేందర్ గౌడ్ తిరుపతి రమేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

గోధాదేవి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి

Satyam NEWS

సిద్దిపేటలో గన్ పాయింట్ లో రూ.43 లక్షల దోపిడి

Satyam NEWS

సిద్ధిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో రైతు సేవ ఎరువుల కేంద్రం

Satyam NEWS

Leave a Comment