సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటరులో బుధవారం ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించారు. ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి బాణసంచాను కాల్చారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని పలువురు నేతలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జక్కుల వెంకయ్య,మాజీ ఎంపిపి లు చెన్నబోయిన సైదులు,పాలేటి రామారావు,పిఏసిఎస్ చైర్మన్లు అన్నెం శౌరిరెడ్డి,కట్ట గోపాల్ రావు చౌదరి,కీతా అప్పారావు,పాలేటి వీరేష్,మాజీ కౌన్సిలర్లు తేజావత్ రవి నాయక్,పిల్లి శ్రీనివాస్,రామస్వామి,యరగాని పూర్ణ, రాయల వెంకటేశ్వర్లు,జగన్నాథా చారి, కిరణ్ నాయక్,వల్లం సెట్ల క్రిష్ణయ్య, దీకొండ నరేష్,గూడెపు నాగలింగం, మాజీ సర్పంచ్ చింతమళ్ళ సైదలు, సీతారాంరెడ్డి, హుస్సేన్,షేక్ జానిమియా దుగ్గి గురు వర్మ,కొరివి వీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ హుజూర్ నగర్