కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏర్పుల నరోత్తం.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. బీఆరెస్ లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో నరోత్తం బీఆర్ఎస్ పార్టీలో జాయినయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ … ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నరోత్తం గతంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యే గా పోటీచేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. జహీరాబాద్ నియోజకవర్గ మేలుకోసం బీఆర్ఎస్ పార్టీలో చేరానని నరోత్తం చెప్పారు. కేసిఆర్ నాయకత్వంలో బీఆరెస్ లో చేరడం సంతోషంగా ఉందన్నారు. వారి మార్గదర్శకత్వంలో పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు