40.2 C
Hyderabad
April 29, 2024 15: 28 PM
Slider విశాఖపట్నం

సోషల్ మీడియాలో యువతిని బెదిరించిన వ్యక్తి అరెస్టు

#Disha SOS

విశాఖపట్నం జిల్లా పిఎం పాలెం లో నివాసముండే యువతిని సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురిచేసాడు ఓ ఆగంతకుడు. ఫోటో లను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తానాని యువతిని బెదిరించాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.

నిముషాల వ్యవధిలో బాధిత యువతిని దిశ పోలీసులు కలిసి భరోసాను కల్పించారు. అజ్ఞాత వ్యక్తి సోషల్ మీడియా ద్వారా యువతికి పంపిన మెసేజ్ లు, ఫోటో లను దిశ పోలీసులు సేకరించారు. యువతికి ఇన్స్టా గ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

బాధిత యువతి ఇచ్చే ఫిర్యాదు మేరకు ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని PM పాలెం పోలీసులు పేర్కొన్నారు.

Related posts

నిరుపేద వలస కూలీలకు బియ్యం పంపిణీ

Satyam NEWS

హరిత హరం పేరుతో పేదల భూములను గుంజుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమే…

Satyam NEWS

Leave a Comment