విశాఖపట్నం జిల్లా పిఎం పాలెం లో నివాసముండే యువతిని సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురిచేసాడు ఓ ఆగంతకుడు. ఫోటో లను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తానాని యువతిని బెదిరించాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
నిముషాల వ్యవధిలో బాధిత యువతిని దిశ పోలీసులు కలిసి భరోసాను కల్పించారు. అజ్ఞాత వ్యక్తి సోషల్ మీడియా ద్వారా యువతికి పంపిన మెసేజ్ లు, ఫోటో లను దిశ పోలీసులు సేకరించారు. యువతికి ఇన్స్టా గ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
బాధిత యువతి ఇచ్చే ఫిర్యాదు మేరకు ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని PM పాలెం పోలీసులు పేర్కొన్నారు.