39.2 C
Hyderabad
April 28, 2024 12: 54 PM
Slider హైదరాబాద్

ప్రజాసేవకే నా జీవితం అంకితం: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

#uppalmla

నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం చర్లపల్లి శ్రీకృష్ణ కన్వెన్షన్ లో జరిగిన తన జన్మదిన వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం రాష్ట్ర యంత్రాంగం తో పాటు సీఎం కేసీఆర్ ను ఒప్పించి వేల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చిన ఘనత ఉప్పల్ కే సొంతమన్నారు. బస్తీలు లేని నియోజకవర్గం గా అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఉప్పల్ నియోజకవర్గం ను తీర్చిదిద్దుతానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ జన్మదిన సందేశాన్ని పంపించడం జరిగింది.

కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి, ఫిర్జాదిగూడ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు జక్కా వెంకటరెడ్డి బుచ్చిరెడ్డి లు జన్మదిన వేడుకలలో పాల్గొని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఫోన్లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి జర్రిపోతుల ప్రభుదాస్, శాంతి సాయి జన్ శేఖర్, స్వర్ణ రాజు మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ పాత్రికేయ సోదరులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు నియోజకవర్గ పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ముందుగా మల్లాపూర్ లోని దేవాలయాలలో కుటుంబ సభ్యులు బేతి స్వప్న భేతి సుమంత్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పూజలు నిర్వహించి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మానసిక చిన్నారుల శరణాలయంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కమల నగర్ లోని సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయం, కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

కుషాయిగూడ బస్ స్టాండ్ లో ఎమ్మెల్యే బేబీ సుభాష్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లను గజమాలతో ఘనంగా సత్కరించిన చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వామనరావు దంపతుల హత్యపై కూకట్ పల్లి న్యాయవాదుల నిరసన

Satyam NEWS

మేడారం మినీ జాతరలో కరోనా వైరస్ కలకలం

Satyam NEWS

కోడలిని వేధింపులకు గురిచేసిన వైసీపీ నేత

Satyam NEWS

Leave a Comment