మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేగింది. మేడారం మినీ జాతరలో పాల్గొన్న దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.
జాతరలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా తేలింది. ములుగు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి అప్పయ్య ఉద్యోగులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు.
దీంతో అధికారులు, జాతరకు విచ్చేసిన భక్తులు ఆందోళనలో ఉన్నారు.