ఖమ్మం జిల్లా ఆల్లిపురం గ్రామంలో దీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొటున్న ఇనాం భూముల హక్కు సమస్యపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది. ఇనాం భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ద్వారా ఆయా భూమి మీద హక్కు కల్పించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూధన్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రావూరి కరుణ, ఆర్డిఓ రవీంద్రనాథ్, మాలతి, తహసిల్దార్ శైలజ, చైర్మన్ శ్వేత, సుడా చైర్మన్ విజయ్, కృష్ణ తదితరులు ఉన్నారు.
previous post