గత కొన్ని రోజులుగా దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్నందున నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ఎందరో దాతలు ముందుకు వస్తున్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా తలకొండపల్లి జడ్పీటిసి ఉప్పల వెంకటేష్ తలకొండపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మిక సిబ్బందికి 25 రైస్ ప్యాకెట్, నిత్యావసర సరుకులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గా, ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలంగౌడ్, సర్పంచ్ లలిత జ్యోతయ్య, గోపాల్ నాయక్, వెంకటపురం సర్పంచ్ రమేష్ యాదవ్, ఖానాపూర్ సర్పంచ్ వెంకట్ రామ్ రెడ్డి, జగదీశ్వర్, వార్డు సభ్యులు నూకం కోటేశ్వర్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్ యువకులు వెంకటేష్ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.