37.2 C
Hyderabad
May 2, 2024 12: 04 PM
Slider ముఖ్యంశాలు

నవంబర్ 3 లోపే రైతు బంధు డబ్బులు వెయ్యాలి

#UttamKumarReddy

రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ, మాజీ టి పి సి సి అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్

రైతు బంధు ఆపెయ్యాలని తాను  అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం అబద్ధమని,అతి దారుణమని కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నవంబర్ 3వ,తేదీ లోపు రైతు బంధు నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాత్రమే తాను అన్నానని, కేసీఆర్ కు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేసి,లక్ష రూపాయల ఋణమాఫీ వెంటనే పూర్తి చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయలు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై మరో కేసుకు రంగం సిద్ధం

Satyam NEWS

ఐ బౌటిక్ & స్టూడియో లుక్స్ ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్

Satyam NEWS

సినిమా స్టార్ట్:విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ షూటింగ్

Satyam NEWS

Leave a Comment