40.2 C
Hyderabad
April 28, 2024 15: 22 PM
Slider నిజామాబాద్

దేవునిపల్లిలో నూతన బ్యాంక్ ప్రారంభం

#idbi

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐడిబిఐ బ్యాంకును నేడు ప్రారంభించి కామారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా బ్యాంక్ జోనల్ హెడ్ హైదరాబాద్ జోన్ సిజిఎం శరత్ కామత్, డిప్యూటీ జోనల్ హెడ్ హదరబాద్ జోన్ వాసుదేవన్ లు మాట్లాడుతూ.. హైదరాబాద్ జోన్ కింద కామారెడ్డి శాఖ 101 వ బ్రాంచ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రకాల బ్యాంకింగ్ సేవలతో బ్రాంచి ప్రారంభం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

అన్ని విధాలా బ్యాంకు సిబ్బంది కస్టమర్లకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలు తమ బ్యాంకును ఆదరించాలని కోరారు. అనంతరం బ్యాంకు మేనేజర్ గా వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్2 రీజనల్ హెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హసిం, ఆర్కే కళాశాల కరెస్పాండెంట్ జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ కృష్ణాజిరావు, కాసర్ల స్వామి, సప్తగిరి ఇండస్ట్రీస్ హరీష్, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్తున్న జగన్

Satyam NEWS

ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

మేడారం తల్లులను సందర్శించుకున్న గండ్ర సత్తెన్న

Satyam NEWS

Leave a Comment