మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం లోని రామంతపూర్ డివిజన్ పరిధిలో కెసిఆర్ నగర్ లో ఇరిగేషన్ నాలా పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని గురువారం ఉప్పల్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుధా, సర్వేయర్ వెంకటేష్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాసిల్దార్ ఆదేశాను సారం ఖాళీ స్థలం పరిశీలించి సర్వే నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ స్థలమని తేలితే ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ స్థలాన్ని ప్రజల ప్రయోజనార్థం కేటాయిస్తామని వారు తెలిపారు. రెవిన్యూ సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి