ఆగస్టు 15 లోపు పెండింగ్లో ఉన్న వైకుంఠధామం పనులు పూర్తి చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు.
మంగళవారం వనపర్తిలోని కలెక్టర్ చాంబర్లో జరిగిన వైకుంఠధామం నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 పనులు పెండింగ్ ఉన్నాయని కిష్టం పల్లి, చిన్న మరూరు, అప్పరాల, నాగళ్ళ బండ తండా, తూముకుంట, బండారావిపాకుల, గొల్ల పల్లి, రేమద్దుల తదితర గ్రామాలలో ఆగస్టు 15 లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డి ఆర్ డి ఓ, డి పి ఓ, పి ఆర్ ఈ ఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి