కడప జిల్లా రాజంపేట లోని ప్రసిద్ద పరశురామ క్షేత్రమైన హత్యరాలలో గురువారం లోకకల్యాణార్థం అత్యంత శక్తి వంతమైన వనదుర్గ మహావిద్య హోమం,యాగం నిర్వహించారు.
గుంటూరు జిల్లా కు చెందిన వేద పండితులు వ్యాకరణం గణపతి శర్మ,వేలమకాన్ని నాగార్జున శర్మ,సన్నిధానం విశ్వనాధనం శర్మ రాజంపేట హత్యరాల పరశురామ క్షేత్రం ప్రాంగణంలో ఈ యాగం నిర్వహించారు.
పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల వారితో పాటూ దేశంలో ని ప్రజలు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ యాగం తలపెట్టారు.
30 ముఖ్య క్షేత్రాలల్లో జరుగనున్న ఈ యాగాలల్లో 10 వ యాగం గా హత్యరాలలో నిర్వహించారు.