పద్మశ్రీ వనజీవి రామయ్య కుమారుడు దరిపల్లి సైదులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని వారి స్వగృహంలో సైదులు మృతదేహాన్ని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్ది కిషోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, గొనె భుజంగ రెడ్డి, తిప్పిరెడ్డి వీరారెడ్డి, కాంపాటి రమేష్, మొగిలిచర్ల సైదులు తదితరులున్నారు.