38.2 C
Hyderabad
May 3, 2024 19: 23 PM
Slider ఆధ్యాత్మికం

ఆది వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో విశేషంగా వరలక్ష్మీ వ్రతాలు

#varalaxmivratam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల బూరుగడ్డ గ్రామంలో నిత్య పూజలందుకుంటున్న  శ్రీ శాల్మలి కంద ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదిన సందర్భంగా స్వామివారికి, గోదాదేవి అమ్మవారికి బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవ,ఆరాధన, ప్రత్యేక సేవాకార్యక్రమాలు అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తదనంతరం మహిళ భక్తులతో సామూహికంగా వరలక్ష్మీ వ్రతములు,శ్రీ లక్ష్మి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము,విశేష కుంకుమార్చన,వరలక్ష్మి వ్రతకథను శ్రావ్యంగా వినిపించారు. అనంతరం మహిళా భక్తులు వాయనములు ఇవ్వడం జరిగింది, అర్చకులు స్వామి అమ్మవార్లకు మహా నివేదనను ఆరగింపు చేసి,మంగళా శాసనం,తీర్థప్రసాద వినియోగం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి,గ్రామ భక్తులు,గ్రామ పెద్దలు, మహిళా భక్తులు,ఆలయ సిబ్బంది  పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ముందస్తు ఎన్నికలు ఇక లేనట్టే

Satyam NEWS

పశువుల పునరుత్పత్తి శిబిరాలను వినియోగించుకోవాలి

Satyam NEWS

అనుమతి లేకుండా చెట్లు నరికితే చట్ట ప్రకారం చర్యలు

Satyam NEWS

Leave a Comment