పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో సోమవారం గాంధీ స్మారక సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి వారోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలో గోగులపాడు, రొంపిచర్ల గ్రామాల్లో గల జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి వారోత్సవ వేడుకలు జరిగాయి.
ఆయా పాఠశాలల్లో జరిగిన గోపాలకృష్ణయ్య జయంతి వారోత్సవ వేడుకల్లో పాల్గొన్న గాంధీ స్మారక సమితి వ్యవస్థాపకులు ఈదర గోపీచంద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య నేటితరానికి ఆదర్శనీయులని అన్నారు. గాంధీ బాటలో పయనించి నిరాండబర జీవితాన్ని ఆచరించారని అన్నారు.
అనంతరం ఆయా పాఠశాలలో గాంధీ స్మారక సమితి వారు ప్రచురించిన గాంధీజీ జీవితం -ఒక సందేశం, జాతీయోద్యమ కరదీపికలు అనే పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్నపూర్ణదేవి, షేక్ మొహిద్దీన్ సాహెబ్, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి,లెనిన్,విద్యార్ధులు పాల్గొన్నారు.