28.2 C
Hyderabad
May 8, 2024 23: 50 PM
Slider ప్రకాశం

సమాజాన్ని చైతన్యపరిచే శక్తి వేమన పద్యాలకుంది

#vemana

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిధిలోని పొదలకొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వేమన ఫౌండేషన్ అనంతపురం అప్పిరెడ్డి హరినాథ రెడ్డి వారి ఆర్థిక సహాయంతో వేమన జయంతిని నేడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉప జిల్లా విద్యాశాఖాధికారి ఎం కాశీశ్వర్రావ్ పాల్గొని మాట్లాడుతూ వేమన పద్యాలు సమాజాన్ని చైతన్యపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. 

వేమన స్వచ్ఛమైన తెలుగులో చెప్పారన్నారు. మరుగున పడిన వేమన పద్యాలను సిపి బ్రౌన్ లాంటివారు ఇంకా కొన్ని దేశాల వారు వారి భాషలలో పుస్తకాలు ముద్రించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. వేమన ప్రజా కవిగా సమాజంలో నిలబడిపోయారని తెలిపారు. వేమన పద్య పోటీలలో పాల్గొని గెలుపొందినవారికి  వేమన ఫౌండేషన్ వారి ప్రశంసా పత్రాలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరత్నం, విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ అధికారి తోట నరసింహులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

సందీప్ మాధ‌వ్ హీరోగా స‌రికొత్త రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌

Satyam NEWS

ఎలర్ట్: కలకలం సృష్టిస్తున్న నంద్యాల శానిటైజర్లు

Satyam NEWS

పేదల కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారింది

Satyam NEWS

Leave a Comment