వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామివారి మహా శివరాత్రి జాతరకు రావాల్సిందిగా దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి కృష్ణవేణి రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందచేశారు. వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబుతో సహా స్థానాచార్యులు అప్పాల భీమ శర్మ తదితరులు ప్రగతి భవన్ కు వెళ్లి మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందచేశారు.
ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించారు. జిల్లాకు చెందిన మంత్రిగా కేటీఆర్ మహా శివరాత్రి కి శ్రీ రాజ రాజేశ్వర స్వామివారి కి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. మంత్రి కేటీఆర్ తో బాటు జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ లు కూడా మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు విచ్చేయనున్నారు.