వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మద్దాలి గిరి నేడు ప్రారంభించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 43వ వార్డ్ అమరావతి రోడ్ లోని అలా హాస్పిటల్ పక్కన ఉన్న 140 సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి తోబాటు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, DMHO యాస్మిన్, 43వ డివిజన్ అధ్యక్షులు, ముఖ్యనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ ఆర్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.