వేములవాడను దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. అతి త్వరలోనే సిరిసిల్ల-వేములవాడ కలిసిపోతాయని మంత్రి తెలిపారు. ఇవాళ మంత్రి కేటీఆర్ వేములవాడలో మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వేములవాడ ప్రాంతం మిగతా పాలకుల హయాంలో వివక్షకు గురైందని,ఇక్కడి వస్తేనే మంత్రి పదవిపోతాడని అపవాదును ముజేయమంత్రి కెసిఆర్ తొలగించి ఋ.400 కోట్లతో అభివృద్ధికి బాటలు వేసాడని అన్నారు.గోదావరి నీళ్లను తీసుకొచ్చి సిరిసిల్ల, వేములవాడ బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే రెండు లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని మంత్రి తెలిపారు.
వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామనీ, యాదాద్రి ఆలయ పనులు త్వరలోనే పూర్తికానున్నాయని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టంతా ఇక వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివృద్ధిపైనే ఉందన్నారు.అభివృద్ధి కావాలంటే వేములవాడలో 27 మంది తెరాస అభ్యర్థులను గెలిపించాలని అయన కోరారు.
బీజేపీ ముళ్ళచెట్టు లాంటిదని దానికి నీళ్లు పోస్ట్ కాయలు కాస్తాయా అన్నారు కేటీఆర్ బీజేపీ కి పని తక్కువ బిల్డప్ ఎక్కువ అని కేటీఆర్ విమర్శించారు. నీతిఅయోగ్ ద్వారా మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వమంటే ప్రధాని మోదీ పట్టించుకోలేదనీ.. చెరువుల పునరుద్ధరణకు రూ. 5 వేల కోట్లు ఇవ్వమంటే కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ ఎందుకు ఓటెయ్యాలని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటికే పల్లెల రూపురేఖలు మారుతున్నాయనీ, ఇక పట్టణాల దశ మారుస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రమేష్ బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ అభ్యర్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.