హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి యండి. ఇమ్రాన్ ఖాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కొల్లాపూర్ ఖాదర్ బాషా దర్గా అల్లా ఆశీస్సులు కలగజేయాలని దర్గాలో ప్రార్థనలు చేశారు. హుజురాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రార్థనలు చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి హుజురాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.