విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.వి. తిరుపతిరావు విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో, వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించినందుకు గాను సీఐ ని… భారత రాజ్యాంగ దినోత్సం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆధ్వర్యంలో విజయనగరం రూరల్ సర్కిల్ కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు, పూలమాల, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, సన్మానించారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్యసంఘం వారు మాట్లాడుతూ సిఐ తిరుపతిరావు గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతంలో పనిచేసిన సమయంలో అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గోని విశేశమైన సేవలు అందించి ప్రజల ప్రశంసలు పొందారన్నారు. అందుకు గాను విజయనగరం రూరల్ సిఐ టి.వి. తిరుపతిరావు ఆర్యవైశ్య సంఘం ప్రత్యేకంగా అభినందించి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు వారణాశి మురళీకృష్ణ (రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్), మల్లేశ్వరరావు, సుధాకరరావు, జామి వెంకటరమణ, నర్సింహమూర్తి తదితరులు పాల్గోన్నారు