విజయనగరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) డి.రమేష్ కి పదోన్నతి లభించింది. ఆయనకు సహాయ సంచాలకులుగా (ఏ.డి ) గా పదోన్నతి కల్పిస్తూ, విజయనగరంలోనే నియమించారు.
రమేష్ ప్రస్తుతం డీపీఆర్వో గా ఉంటూ దాదాపు రెండేళ్ల నుంచీ సహాయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు కూడా రమేష్, జిల్లాలో డివిజనల్ పిఆర్వోగా, డిపిఆర్వో గా కూడా విధులు నిర్వహించారు.
పదోన్నతి వరించిన రమేష్ ని పలువురు జిల్లా అధికారులు, జర్నలిస్టులు ,అలాగే ఆఫీసు సిబ్బంది అభినందనలు తెలిపారు.