33.7 C
Hyderabad
April 30, 2024 00: 04 AM
Slider వరంగల్

పెండింగ్ లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నాం

#sridevi

ములుగు మండలం అబ్బాపూర్ గ్రామం లో ములుగు ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి సుధీర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను నేడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబ్బాపూర్ గ్రామం లో ఎప్పటి నుండో ఉన్న డ్రైనేజి సమస్యను ఈరోజు పరిష్కరిస్తున్నామని తెలిపారు.

అబ్బాపూర్ గ్రామం లో మిషన్ భగీరథ పనులు పూర్తి ఐనా కాంట్రాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు నీటి చుక్క రాలేదని అన్నారు.

దాంతో  మిషన్ భగీరథ AE నర్సయ్య DE సంధ్యరాణి RWSAE లత లతో సమస్య పై మాట్లాడి అతి త్వరలో నీళ్ల వచ్చేలా చూడాలని సూచించారు.

జకారం గ్రామం లో సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పించారు. వర్షం నీరు నిల్వ అయ్యే నీటి తొట్టిలలో నీటిని ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ దగ్గర ఉండి మరి శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమం లో సర్పంచ్ దాసరి రమేష్ అబ్బాపూర్ సర్పంచ్ గండి కల్పన కుమార్  mpdo శ్రీనివాస్ RWSAE లత APO అబ్బాపూర్, జకారం సెక్రటరీలు గ్రామశాఖ అధ్యక్షులు బ్రమ్మచారి TRS నాయకులు కుమార్ తరుణ్ రెడ్డి స్కూల్ చైర్మన్ కుమార్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ ఐ, ఎస్ ఐ

Satyam NEWS

హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ ప్రతి క్రీడాకారుడికి ఆదర్శం

Satyam NEWS

హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం

Satyam NEWS

Leave a Comment