దాదాపు రెండేళ్ల క్రితం… కోర్ట్ కస్టడీ నుంచీ పారిపోయిన ముద్దాయి ని చాకచక్యంగా పట్టుకుని తిరిగి… అప్పగించారు. ఈ మేరకు….విజయనగరం రూరల్ సీఐ తిరుపతి రావు…ఆ కానిస్టేబుళ్లను అభినందించారు.
విజయనగరం రూరల్ పీఎస్ క్రైమ్ నెంబర్: 284/2021 యూఎస్ 224 ఐపీసీ కేసులో ముద్దాయి పుర్రు సత్యనారాయణ 22-1-2021 దిన కోర్టు వారి కస్టడీ నుండి పారిపోయినాడు. అప్పటి నుండి ఈ ముద్దాయి యొక్క ఆచూకీ లభించలేదు. ఈ ముద్దాయికి నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు వారు జారీ చేశారు.
కోర్టువారిచ్చిన వారెంట్ ను విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పీసీ-587, కోరాడ రామ్మోహన్ మరియు పీసీ-450, వి. రామకృష్ణ చాలా శ్రమించి ముద్దాయిని పట్టుకొని, కోర్టు వారికి అప్పగించగా, కోర్టు వారు ముద్దాయికి రిమాండ్ విధించారు.లాంగ్ పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఎగ్జిక్యూట్ చేసిన కానిస్టేబుళ్లు రామ్మోహన్, రామకృష్ణ లను రూరల్ సిఐ టివి తిరుపతిరావు, ఎస్ఐ గణేష్ అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు.