విజయనగరం జిల్లా కేంద్రం వరుస ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. ఓవైపు కోట వద్ద విద్యార్ధి ,యువజన సంఘాలు ధర్నా చేస్తుండగానే మరోవైపు కలెక్టరేట్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ ధర్నా కు దిగింది. ముందు గానే టీఎన్ఎస్ఎఫ్ ధర్నా చేస్తారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు… పొద్దున్నే టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఇండ్ల వద్ద మొహరించి..ధర్నాకు వెళుతున్న వారిని అరెస్ట్ చేసి వన్ టౌన్ స్టేషన్ లో ఉంచారు. విషయం దావాలనంలా పాకడంతో మరికొంత మంది టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఖాకీల కళ్ళు గప్పి…కలెక్టరేట్ వద్దకు చొచ్చుకెళ్లారు.అప్పటికే పోలీసులు భారీగా అక్కడ మొహరించి.. బలవంతంగా టీఎన్ఎస్ఎఫ్ నేతలను అరెస్టు చేసారు. ఏదైనా కలెక్టరేట్ ప్రాంగణం మరోసారి రణరంగంగా మారింది.
previous post
next post