40.2 C
Hyderabad
April 29, 2024 16: 42 PM
Slider కడప

వాలంటీర్లు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే మేడా 

#medamallikarjunreddy

అన్నమయ్య రాయచోటి జిల్లా నందలూరు ఎంపిడిఓ  కార్యాలయంలో మంగళవారం వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్ డి ఓ కోదండరామిరెడ్డి , ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా వాలంటీర్లకు సేవా మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర, పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు.

నందలూరు మండలం లో ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అర్హులందరికీ అంద జేయడంలో కృషి చేసిన వాలంటీర్లు 154 మందికి సేవా మిత్ర,5 మందికి సేవ రత్న, పురస్కారాలు ప్రదానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీ నరసయ్య, భూమన శివశంకర్ రెడ్డి , సౌమ్యనాథ స్వామి టెంపుల్ చైర్మన్ సౌమిత్రి , కో ఆప్షన్ మెంబెర్స్, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సకాలంలో సీఎంఆర్ పూర్తి చేసే మిల్లర్లపై ఒత్తిడి తగ్గించే చర్యలు

Satyam NEWS

సైమన్ కమీషనుకు గుండెలు చూపిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు

Satyam NEWS

ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉంది: డాక్టర్ బ్రహ్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment