వీ.వీ.గిరి,ఘంటశాల ,సుశీల, వంటి మహనీయులు నడియాడిన విజయనగరంలో కరోనా పుణ్యమా పోలీసులు హాడావుడి కనిపించింది. కరోనా సెకండ్ వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవడం పట్ల జిల్లా పోలీసులు మరింత గా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో మరి కొద్ది రోజులలో పదోన్నతి పై బదిలీ కానున్న విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ.. నగరంలో ని మాస్క్ లు పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సాయంత్రం కోట జంక్షన్ వద్ద తనిఖీ లు నిర్వహించారు.
మేన్ ప్యాక్ ద్వారా సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. అదే సమయంలో మూడులాంతర్ల వద్ద జరీమాన లు విధిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు.. ఉన్న పళంగా కోట జంక్షన్ వద్ద కు వచ్చారు.
అంతవరకూ ఎస్పీ ఒక్కరే…తన గన్ మెన్ లతో మాస్క్ ల పెట్టుకోవడంపై పరిశీలించారు. కొద్ది సేపటికి వన్ టౌన్ ఎస్ఐ దేవీ…కోట జంక్షన్ కు వచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపటికి వన్ టౌన్ సీఐ మురళీ వచ్చారు. వెనువెంటనే కోట జంక్షన్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు వచ్చి మాస్క్ పెట్టుకోని వారిని గుర్తించి ఫోన్ లలోనే జరీమాన విధించారు.
ఇదంతా నగర రోడ్లపై ఎస్పీ ఉండగానే పోలీసు సిబ్బంది మాస్క్ ల అవేర్నస్ తో పాటు జరీమాన విధించారు. దాదాపు గంటన్నర సేపు నగరంలో ని కోట జంక్షన్ వద్ద ఎస్పీతో పాటు నగర పోలీసు లు నగర ప్రజలలో కాస్త భయాందోళనలు కల్పించారు.