సుమారు ఏడు నెలల క్రితం తెలుగు రాష్ట్రాలలో ఒక్కటైన ఏపీలోని ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు వచ్చిన లేడీ పోలీస్ బాస్ దీపిక…తన శైలిలో అటు స్టేషన్ల తనిఖీలు..ఇటు రోజువారి మేన్ ప్యాక్ ద్వారా సెట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ…శాఖ సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నారు. దీంతో పోలీస్ బాస్ ఆదేశాలతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది..రాత్రిళ్లు తనిఖీలు చేపట్టి..జరీమానాలు వేస్తునే ఉన్నారు. తాజాగా మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు మరియు స్పెషల్ ఎన్పోర్సమెంట్ పోలీసులు సంయుక్తంగాదాడులు చేసారు. ఈ దాడుల్లో 9 కేసులతో ముగ్గురిని అరెస్టు చేసి 141.6 లీటర్ల నాటు సారాను, 1.08 లీటర్ల ఐ.ఎం.ఎల్.ఎఫ్. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా తయారీకి సిద్దం చేసుకొన్న 300 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలు, డ్రమ్ములను ధ్వంసం చేశారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై 25 కేసులను పోలీసులు నమోదు చేశారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 5 కేసును పోలీసులు నమోదు చేశారు.