సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి అక్షింతలు
అస్సలు సిబ్బంది ఏం చేస్తున్నట్టు..?.నైట్ పూట్ గస్తీ ఏమైంది..? సిబ్బంది అంతా ఏమైయ్యారు.? జిల్లాలో అంతర్ రాష్ట్ర నేరగాళ్లు దిగారన్న సమాచారం తెలుసుకోకపోతే ఎలా..? ఇంకేం డ్యూటీ చేస్తున్నట్టు..? ఇదీ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్…సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం. ముందు రోజు విశాఖ రేంజ్ డీఐజీ జిల్లాలో ఆకస్మికపర్యటన సందర్భంగా అంతర్ రాష్ట్రముఠా దిగిందన్న సమాచారం తెలియడంతో…ఎస్పీ అలెర్ట్ అయ్యారు.మర్నాడు పొద్దునే సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రతీ వారం డీసీఆర్ బీ సిబ్బంది ఏం చేస్తున్నారని ఎస్పీ కాసింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రతీ రోజూ లానే ఉదయం 8 గంటలకు మొదలైన సెట్ కాన్ఫరెన్స్.. దాదాపు రెండుగంటలకు పైగా కొనసాగింది. జిల్లాలో సిబ్బంది అంతా అందునా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అలెర్ట్ గా ఉండాలని…ప్రత్యేకించి క్రైమ్ పార్టీలు మరింత అలెర్ట్ గా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో గుజరాతీ గ్యాంగ్ లు దిగాయని మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిబ్బందిని అలెర్ట్ చేసారు.ఇక సెట్ కాన్ఫరెన్స్ ద్వారా…బొబ్బిలి, విజయనగరం ట్రాపిక్,అదే విధంగా రూరల్ లో మేన్ ప్యాక్ లు కొరత ఉందన్న విషయం ఎస్పీ దృష్టి రావడంతో…వెంటనే డీసీఆర్బీ సీఐ కు ఆ కొరత జాబితాన పంపాలని ఎస్పీ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఏఆర్ ఆడ్మిన్ అధికారికి ఆదేశించారు.అలాగే ట్రాపిక్ సిబ్బంది ఎవ్వరూ నైట్ డ్యూటీలు చేయటం లేదంటూ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ట్రాఫిక్ డీఎస్పీ…ఎస్పీ వివరించారు.దీంతో తక్రణం…ఆ డ్యూటీ చార్ట్ ను తన వద్దకు పంపించాలని ఆదేశించారు.ఏదైనా ఈసారి జరిగిన సెట్ కాన్ఫరెన్స్ లో ఎస్పీ…సిబ్బందిపై కాస్త ఆసహనం,ఆగ్రహంతో ఉన్నారన్నది సమాచారం.