రాష్ట్ర వ్యాప్తంగా మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ రాజకుమారీ తన సిబ్బంది తో దగ్గరుండీ ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు.
ఈ మేరకు జిల్లా లోని గుర్ల మండలం అతి సమస్యాత్మక గ్రామమైన కెల్ల ను ఎస్పీ రాజకుమారి సందర్శించి, భద్రతను స్వయంగా పర్యవేక్షించారు.,
పోలింగు కేంద్రం బయట పరిస్తితిని డ్రోను సహాయంతో పరిశీలించారు.ఎస్పీతో పాటు ఏ ఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐ శ్రీనివాస రావు లు ఉన్నారు.