పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలగించారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
కిరణ్ బేడీ స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
దీంతో పార్టీ బలం మెజార్టీ మార్కు దిగువకు చేరడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.
ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగించి తమిళిసైకు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.