29.2 C
Hyderabad
May 10, 2024 01: 11 AM
Slider వరంగల్

తక్షణమే రాష్ట్రంలో వికలాంగుల బంధు అమలు చేయాలి

#mulugu

వికలాంగుల హక్కుల పోరాట సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. సమితి జిల్లా అధ్యక్షుడు మంచోజు చంద్రమౌళి ఆధ్వర్యంలో వి హెచ్ పి ఎస్ జెండాను ముందుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వి శెచ్ పి యస్  జిల్లా ఉపాధ్యక్షుడు కోడారి సాంబయ్య, పూజారి  మాణిక్యం అధికార ప్రతినిధి మేకల సంజీవరావు, ప్రదాన కార్యాదర్ళ బోచ్చు శ్రీనివాస్, వి హెచ్ పి ఎస్ జిల్లా కోశాధికారి మోరే రమేష్, మంగపేట మండల అధ్యక్షులు నరసింహారావు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు జనగాం భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వేణు ములుగు మండల నాయకురాలు అరుణ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జన్ను రవి, నందనూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణ అనంతరం ములుగు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు ప్రకటించినట్లు వికలాంగుల బందు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ములుగు జిల్లాలో డిబ్ల్యు ఓ అధికారిణి వికలాంగుల సంఘాలను పట్టించుకోకుండా, వారి డిమాండ్లు పరిష్కరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కుకి తెలియపర్చినట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి వికలాంగుల సాధకబాధకాలను పట్టించుకోవాలని ఆయన కోరారు.

Related posts

విహారయాత్రలో విషాదం: నలుగురు గల్లంతు

Satyam NEWS

బాబాయి హత్య కేసులో జగన్ మేనమామ కు సీబీఐ విచారణ

Satyam NEWS

కుషాయిగూడాలో ఘనంగా శోభాయాత్ర

Satyam NEWS

Leave a Comment