జర్నలిస్టులకు లక్ష రూపాయల నిత్యవసర సరుకులను చంపాపేట్ డివిజన్ తెరాస నాయకుడు నల్ల రాఘమారెడ్డి పంపిణీ చేశారు.
కరోనా వైరస్ కబళిస్తున్న ప్రస్తుత తరుణంలో సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను పాటిస్తూ సమాచార సేకరణలో అలుపెరుగని జర్నలిస్టుల నిత్యవసర వస్తువుల కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి కష్టాలను అర్థం చేసుకుని వారికి చేయుతగా రాఘమారెడ్డి సహాయాన్ని అందిచారు.
ఒక్కకరికి జర్నలిస్టుకు 25 కేజీ ల బియ్యం, 5 కేజీ నూనె, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. సాధారణ రోజుల్లో పాత్రికేయుల పట్ల ఎంతో ఆప్యాయ ప్రేమలను వలకబోసే ప్రజా ప్రతినిధులు, అధికారులు నేతలు, ఎందరో ఉన్నా ప్రస్తుత సమయంలో కనీసం పలకరించపోవడం జర్నలిస్టు అందరికీ అనుభవమే. సహాయం ఎంత అనేది పక్కన పెడితే కనీసం గుర్తించినందుకు జర్నలిస్టులందరు నల్ల రాఘమారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.