గ్రామాల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ,మాచవరం గ్రామంలో శ్మశానవాటిక స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో 15వ, ఆర్థిక సంఘం నిధులు సుమారు అయిదు లక్షల రూపాయలతో మాచవరంలో శ్మశానవాటికను నిర్మించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.శ్మశానవాటికలో స్నానపు గదులు,నీటి సౌకర్యం,ఇతర మౌళిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య,ఉప సర్పంచ్ శీలం ఆదెమ్మ,రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ మాడుగుల పరుశురామ్,ఎఈ సాయిరామ్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండు సైదులు,కార్యదర్శి ఉపేందర్, ఆర్డబ్ల్యుయస్ ఎఈ శ్యామల, పిఏసిఎస్ డైరెక్టర్లు గోపయ్య,వెంకన్న,మాజీ సర్పంచ్ మీగడ రాములు,నరసింహ, నాగరాజు,సత్యం,నరేష్ తదితరులు పాల్గొన్నారు.