38.2 C
Hyderabad
May 2, 2024 22: 29 PM
Slider నల్గొండ

గ్రామాల అభివృద్ధికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

#hujurnagar

గ్రామాల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ,మాచవరం గ్రామంలో శ్మశానవాటిక స్థల పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో 15వ, ఆర్థిక సంఘం నిధులు సుమారు అయిదు లక్షల రూపాయలతో  మాచవరంలో శ్మశానవాటికను నిర్మించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.శ్మశానవాటికలో స్నానపు గదులు,నీటి సౌకర్యం,ఇతర మౌళిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య,ఉప సర్పంచ్ శీలం ఆదెమ్మ,రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ మాడుగుల పరుశురామ్,ఎఈ సాయిరామ్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండు సైదులు,కార్యదర్శి ఉపేందర్, ఆర్డబ్ల్యుయస్ ఎఈ శ్యామల, పిఏసిఎస్ డైరెక్టర్లు గోపయ్య,వెంకన్న,మాజీ సర్పంచ్ మీగడ రాములు,నరసింహ, నాగరాజు,సత్యం,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓటరు జాబితా అభ్యంతరాలను వేగంగా పరిష్కరించాలి

Satyam NEWS

రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కల్వకుర్తి రోడ్లు

Satyam NEWS

సర్కార్ వారి పాట రూ.400 కోట్లు నిజమా? అబద్దమా

Satyam NEWS

Leave a Comment