ఏపీ రాష్ట్రంలో దేవాలయాలలో ఉన్న విగ్రహాలు ద్వంసమవుతున్న వేళ….మారుమూల గ్రామాల్లో ఆ ఛాయలకు దూరంగా పిల్లలంతా ఏకమయ్యారు.
కాదు.. కాదు ఓ ఆధ్యాత్మిక సంస్థ వాళ్లనందరినీ ఏకం చేసింది.మరోవైపు ఆ విధంగా దేవుడినే కొలిచిన మాతృమూర్తులు ఎందరో.
చిన్నప్పటి నుంచీ పిల్లల్లో ఆ విధమైన భక్తి భావన కల్పించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ వికాసతరంగిణి నడుం బిగించింది.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవలో ధనుర్మాసం పూర్తైన సందర్భంగా గోదాదేవి మహత్యం తెలుపుతూ గ్రామంలో చిన్నారులచే విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమం మొత్తం వికాసతరంగిణి జిల్లా అధ్యక్షురాలు అరుణ ఆధ్వర్యంలో పుట్టి గుడ్డి వాళ్లైన గణేష్, పాడుతాతీయగ ఫేమ్ పరమేష్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
సుమారు వందమంది చిన్నారుల విష్ణు సహస్రనామ పారాయణం చేసారు. వికాసతరంగిణి గ్రామంలో పలువురికి వస్త్రాలు పంపిణీ చేసారు.