28.7 C
Hyderabad
April 28, 2024 05: 12 AM
Slider ప్రపంచం

ముడిచమురు ఉత్పత్తి స్థిరంగానే : ఒపెక్ నిర్ణయం

ముడి చమురు ఉత్పత్తిని స్థిరంగా కొనసాగించాలని ఒపెక్, ఒపెక్ అనుబంధ దేశాలు నిర్ణయించాయి. దీంతో ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించట్లేదని సమాచారం. కొవిడ్‌ వైరస్‌ పరిణామాల నుంచి కోలుకుంటున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళన కలిగిస్తున్నా, భవిష్యత్తు గిరాకీపై స్పష్టత లేకున్నా ఒపెక్‌ తన నిర్ణయం మార్చుకోలేదు.

సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని ఒపెక్‌ దేశాలు, రష్యా ఆధ్వర్యంలోని ఒపెక్‌ అనుబంధ దేశాలు ఇంతకు ముందు నిర్ణయించిన విధంగానే నెలవారీ ఉత్పత్తికి కట్టుబడి ఉండడానికి జై కొట్టాయి. అమెరికాతో పాటు చమురును అధికంగా వినియోగించే దేశాలు మాత్రం ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మరింత అధికంగా చమురు ఉత్పత్తి చేయాలని కోరుతున్నాయి.

ధరల పెంపును అడ్డుకునేందుకు వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయంతో భారత్‌ కూడా ఇందులో భాగమైన సంగతి తెలిసిందే. మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తారా, రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలు తగ్గి, చమురుకు గిరాకీ క్షీణిస్తుందా.. అనే అంచనాలే ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనే విషయమై స్పష్టత వచ్చాకే, చమురు ఉత్పత్తిపై నిర్ణయం తీసుకుంటామని ఒపెక్‌ అనుబంధ దేశాలు తెలిపాయి.

Related posts

విద్యల నగరంలో విద్యార్ధులతో మాటకలిపిన మంత్రి బొత్స

Satyam NEWS

ఆరు నెలలకే అస్తవ్యస్తంగా మారిన జగన్ పాలన

Satyam NEWS

అమెరికా అధ్యక్షుడిపై నెగ్గిన అభిశంసన తీర్మానం

Satyam NEWS

Leave a Comment