మహారాష్ట్ర పాల్ ఘర్ ప్రాంతంలో ఈ నెల 16న హిందూ వ్యతిరేకుల చేతిలో దారుణ హత్యకు గురైన ఇద్దరు స్వామీజీల ఆత్మలకు శాంతి చేకూరాలని మంగళవారంనాడు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించాలని విశ్వహిందూ పరిషత్ కోరింది.
ఇద్దరు స్వామీజీలను ఒక కారు డ్రైవర్ ను అతి కిరాతకంగా కొందరు దుండగులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన దుండగులను, వారిని ప్రోత్సహించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించి న్యాయాన్ని బతికించాలని కోరేందుకు దేశంలోని అందరూ జ్యోతి వెలిగించాలని విశ్వహిందూ పరిషత్ కోరింది.