38.2 C
Hyderabad
April 29, 2024 14: 47 PM
Slider నల్గొండ

అభివృద్ధిలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మూడో వార్డు గణేష్ నగర్ లో పలు బజార్లు వర్షాలతో గుంతలు ఏర్పడి కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి సోమవారం వీధులను మట్టితో నింపి జెసిబి సహాయంతో లెవెల్ చేయించి పిచ్చి  మొక్కల తొలగింపు కార్యక్రమం గణేష్ నగర్ కాలనీ వాసులతో కలిసి నిర్వహించారు.

కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీ కావడంతో నూతనంగా ఇళ్ళు నిర్మించి ఉన్నటువంటి బిల్డర్స్,కాలనీ ప్రజలు అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సంపత్ రెడ్డి కోరారు. తాత్కాలిక సమస్యలు పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు సిద్ధం కావాలి

Bhavani

ఒక్క రోజులో దిశ యాప్ ను ఎంత‌మంది డౌన్ లోడ్ చేసుకున్నారో తెలుసా..?

Satyam NEWS

రాజీవ్ గాంధీ హత్య కేసు: వేలూరు జైలు నుంచి విడుదలైన నళిని

Bhavani

Leave a Comment