37.2 C
Hyderabad
May 2, 2024 12: 52 PM
Slider విశాఖపట్నం

జర్నలిజానికి పొత్తూరి సేవలు చిరస్మరణీయం

vizag journos

తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలందించిన ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి మణిరామ్ కొనియాడారు. పొత్తూరు వెంకటేశ్వరరావు గురువారం ఉదయం హైదరాబాదులో మృతి చెందిన నేపథ్యంలో వైజాగ్  జర్నలిస్టు ఫోరం కార్యవర్గం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో సంతాప సభ నిర్వహించింది. 

ముందుగా పొత్తూరు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొత్తూరు కుటంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీడి మాట్లాడుతూ ఐదు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంలో ఎనలేని సేవలు అందించారన్నారు.

అనేక తెలుగు పత్రికలకు సంపాదకులుగా పని చేసిన ఘనత పొత్తూరి కే దక్కుతుందన్నారు. ఆయన సంపాదకీయం ఎన్నో ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసేవిగా వుండేవన్నారు. విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో పొత్తూరు పాల్లో ని ఈ తరం పాత్రికేయులకు అనేక అంశాలపై మార్గదర్శకం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో విజేఎఫ్ ప్రతినిధులు సోడిశెట్టి దుర్గారావు, ఆర్ నాగరాజు పట్నాయక్ ,దాడి రవికుమార్, ఇరోతి ఈశ్వరరావు, గిరిబాబు, గయాజ్, శేఖర్ మంత్రి, బి చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Related posts

శుభమస్తు

Satyam NEWS

50 బైక్ అంబులెన్సు సర్వీసుల ప్రారంభం

Satyam NEWS

ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” టీజర్ విడుదల

Bhavani

Leave a Comment