నిత్యం ప్రజలు కు అందు బాటు లో వుండి.. ప్రజా సమస్యల పై పోరాడుతున్న ప్రజా సేవకుడు రెడ్డి శంకరరావు ను ప్రజలు గెలిపిం చాలని సీపీఎం.జిల్లా కార్యదర్శి టీ. సూర్యనారాయణ.సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బీ.అశోక్ లు పిలుపు నిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం కార్పొరేషన్ కు వచ్చే నెల 10న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వామపక్ష పార్టీలు ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా 33 వ డివిజన్ కార్పొరేటర్ సీపీఎం పార్టీ అభ్యర్థి రెడ్డి శంకరరావు తో పాటు కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఎస్పీ బంగ్లా..చుట్టూ వున్న ఇళ్లకు తిరిగి సీపీఎం అభ్యర్థి రెడ్డి శంకరరావు ను గెలిపించాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి ని గెలిపిస్తే 33 వ డివిజన్ లో సమస్యలపై కార్పొరేషన్ లో ప్రశ్నిస్తా రని అన్నారు. ప్రజాసమస్యల పై పోరాడే చరిత్ర కమ్యూనిస్టు పార్టీలు కు మాత్రమే ఉందని ఇంకా రెడ్డి శంకరరావు మాట్లాడుతూ తనని గెలిపిస్తే ఆస్తి పన్ను భారాలు రద్దు చేయాలని పోరాడుతానని. ఇప్పటికే ఈ సమస్య పై పోరాడుతున్నామని అన్నారు.
డివిజన్ అభివృద్ధి కి కృషిచేస్తానని నిరంతరం ప్రజాసమస్యల పై పోరాడుతున్నామన్నారు. ఒక్కసారి అవకాశమిస్తే డివిజన్ ప్రజలు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోరాడుతానని,కార్పొరేషన్ లో ప్రజా సమస్యల పై ప్రజలవాణిని వినిపిస్తానన్నారు. ఈ ప్రచారం కార్యక్రమం లో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీ. వి. రమణ,ఆనంద్, రమణ,మణి కంఠ తదితరులు పాల్గొన్నారు.