ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్లో మల్లాపూర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల మనోభావాల ఆధారంగా పార్టీ జరిపిన సర్వే లో నా పేరు వచ్చిందన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లకాలం సేవలు చేయడానికి రుణ పడి ఉంటానని ఆయన తెలిపారు.
ఉద్యమకారులందరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త నాయకులకు కార్యాలయాల్లో పనులు అయ్యే విధంగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి నివాసయోగ్య ప్రాంతాలుగా మార్చినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించినట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలో డిగ్రీ, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యకర్తలకు అందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
అశోక్ నగర్ లో హై టెన్షన్ విద్యుత్ తీయాల సమస్య, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. లక్ష మెజార్టీతో గెలిపించాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ గొల్లూర్ అంజయ్య మాట్లాడుతూ.. బండారి అంటే భరోసాని..గుణవంతుడు, ధనవంతుడు పదవులు లేకపోయినా పనులు చేశారని.. ఎమ్మెల్యే గెలిస్తే మరెన్నో పనులు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.