చదువుకు పేదరికం అడ్డుగా ఉండకూడదని ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్త అన్నారు.
సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించి మెయిన్స్ ఢిల్లీలో శిక్షణ కోసం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొటున్న వైశ్య విద్యార్ధికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో సాయం చేశారు. అందుకు కావాల్సిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు ముషీరాబాద్ లోని వైశ్య బాలుర హాస్టల్ సమావేశ మందిరంలో అందచేశారు.
లంగర్ హౌస్ కు చెందిన చంద్ర కిరణ్ ఈ సాయాన్ని అందుకున్నారు. ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవిఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ (న్యూఢిల్లీ) గంజి రాజమౌళి గుప్త లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.