నల్గొండ జిల్లా దేవరకొండ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి అని ఆయన అన్నారు.
గ్రామాలలో కరెంట్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిష్కరం చేస్తానని ఆయన తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన చెప్పారు.
స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. వ్యక్తిగత లబ్దికోసం ప్రజాప్రతినిధులు పనిచేయవద్దు, అందరి కోసం పనిచేయాలి ఆయన కోరారు. గ్రామాలలో పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్,స్మశాన వాటికలు పూర్తి చేయాలి అని ఆయన కోరారు.
అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి సూచించారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దేవరకొండ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్,ఎంపీడీఓ పాండు,తహసీల్దార్ కీరణ్మయి తదితరులు పాల్గొన్నారు.