హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పెట్ డివిజన్ ప్రజా సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం కావడానికి వీలుగా వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని బాగ్అంబర్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి సోమవారం జిహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్ లను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, బాగ్ అంబర్ పేట డివిజన్ ప్రధాన కార్యదర్శి కోడూరి సురేష్ కుమార్, మిర్యాల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.